టోక్యో ఒలింపిక్స్లో భారత్కు మరో పతకం దక్కింది. బుధవారం ఉదయం భారత బాక్సర్ లోవ్లీనా బోర్గోహైన్ టర్కీ బాక్సర్ బ్యూస్ నాజ్ సూర్మా నేలితో మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్లో తలపడింది. 64-69 కిలోల బాక్సింగ్ విభాగంలో జరిగిన టర్కీ బాక్సర్ సుర్మేనెలి చేతిలో 0-5 తేడాతో లోవ్లీనా ఓటమిపాలైంది. అయినప్పటికీ ఆమె సెమీ ఫైనల్ రౌండ్ చేరుకోవడంతో కాంస్య పతకం సొంతం చేసుకుంది. ఈసారి టోక్యో ఒలింపిక్స్లో భారత్కు రెండు కాంస్య, ఒక రజతం పతకాలు లభించాయి. ఆ మూడు మహిళా క్రీకారులే సాధించడం విశేషం. మొదట వెయిట్ లిఫ్టింగ్లో మీరాబాయి చాను, తర్వాత బ్యాడ్మింటన్లో పీవీ. సింధు, తాజాగా బాక్సింగ్లో లోవ్లీనా బొర్గోహెయిన్ పతకాలు తెచ్చారు.