ఈ నెల 24 నుంచి 28వరకు జరుగవలసిన జేఈఈ మెయిన్స్ మే సెషన్ పరీక్షలను కరోనా కారణంగా వాయిదా వేసినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ తెలిపారు. విద్యార్దుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలిపారు. ఈ పరీక్షలు మళ్ళీ ఎప్పుడు నిర్వహించేది www.nta.ac.in వెబ్సైట్ ద్వారా తెలియజేస్తామని, కనుక విద్యార్దులు అప్పుడప్పుడు వెబ్సైట్ను చూస్తుండాల్సిందిగా సూచించారు. మే సెషన్ పరీక్షలు వాయిదా పడినందున ఈ పరీక్షలకు సిద్దమయ్యేందుకు విద్యార్దులకు మరింత సమయం లభించింది కనుక దీనిని సద్వినియోగం చేసుకోవాలని నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్టీఏ) సీనియర్ డైరెక్టర్ డాక్టర్ సాధనా పరాశర్ విద్యార్దులకు సూచించారు. ఇందుకోసం ఎన్టీఏ రూపొందించిన అభ్యాస్ మొబైల్ యాప్ను వినియోగించుకోవాలని సూచించారు.