రాష్ట్రంలో కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అరకొర
చర్యలపట్ల హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా కేసులపై గురువారం హైకోర్టు
విచారణ జరిపినప్పుడు ప్రభుత్వ తీరును తప్పు పట్టింది. ఈ సందర్భంగా హైకోర్టు రాష్ట్ర
ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సందించింది. పలు సూచనలు, ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
·
కరోనా
వ్యాప్తికి కారణమవుతున్న సినిమా థియేటర్లు, పబ్బులు, మద్యం దుకాణాలపై ఎందుకు ఆంక్షలు
విధించలేదు?
·
ఆర్టీపీసీఆర్
పరీక్షలు ఎందుకు నిర్వహించడం లేదు? వాటిని 70 శాతంకు పెంచాలి.
·
కరోనా
జాగ్రత్తలు, నిబందనలు
పాటించనివారిపై ప్రభుత్వం కటినంగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
·
సీరో సర్వైలెన్స్
ఎప్పటిలోగా పూర్తి చేస్తారు?
·
ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలలో వాక్సినేషన్ కోసం ఏమైనా
ఏర్పాట్లు చేస్తున్నారా లేదా?
·
కరోనా
కేసులు గుర్తించిన ప్రాంతాలలో మైక్రో కంటెయిన్మెంట్ జోన్లుగా ప్రకటిస్తున్నారా లేదా?
·
ఇతర రాష్ట్రాల
నుంచి తెలంగాణలోకి ప్రవేశిస్తున్నవారికి తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్
కలిగి ఉండాలి. రాష్ట్రంలో ప్రవేశించిన తరువాత కూడా వారికి తప్పనిసరిగా కరోనా పరీక్షలు
నిర్వహించాలి.