భూపాలపల్లి పరిధిలోని కెటికె 6వ నెంబర్ బొగ్గు గనిలో ఈరోజు మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. గనిలో మూడో సిమ్ 11వ లెవెల్లో కార్మికులు బొగ్గు తవ్వుతుండగా హటాత్తుగా గాని పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో శంకరయ్య, నరసయ్య అనే ఇద్దరు కార్మికులు ఘటనాస్థలంలోనే చనిపోయినట్లు సింగరేణి అధికారులు దృవీకరించారు. గనిలో చిక్కుకుపోయిన మిగిలిన కార్మికులను రక్షించేందుకు ఆ ప్రాంతంలో జేసీబీతో గని పైకప్పును తెరిచేందుకు సింగరేణి అత్యవసర సహాయ సిబ్బంది కృషి చేస్తున్నారు.