కాంగ్రెస్‌పై షర్మిళ ఎఫెక్ట్...ఇందిరా శోభన్ రాజీనామా

March 03, 2021


img

వైఎస్ షర్మిళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చీల్చేందుకే వచ్చారని రేవంత్‌ రెడ్డి తదితరులు చెప్పిన మాట నిజం అవుతోంది. పార్టీ తరపున మీడియాలో గట్టిగా వాదించే పిసిసి అధికార ప్రతినిధి, సీనియర్ కాంగ్రెస్‌ మహిళా నేత ఇందిరా శోభన్ ఇవాళ్ళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. ముందుగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే వైఎస్ షర్మిళ పెట్టబోయే కొత్త పార్టీలో చేరాలనుకొంటున్నట్లు చెప్పారు. పార్టీలో సీనియర్ నేతల తీరుతో తాను విసుగెత్తిపోయానని అందుకే పార్టీని వీడాలని నిర్ణయించుకొన్నట్లు ఇందిరా శోభన్ చెప్పారు. ఏడేళ్ళుగా తనకు అండగా ఉన్న పార్టీలో నేతలు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు అందరికీ ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు. 



Related Post