ఏపీ సిఎం జగన్మోహన్రెడ్డి వైఎస్ షర్మిళ త్వరలో ఖమ్మంలో భారీ బహిరంగసభ నిర్వహించి కొత్త పార్టీని స్థాపించడానికి సన్నాహాలు చేసుకొంటున్నారు. ఈ నేపధ్యంలో ఖమ్మం జిల్లాలోని వైసీపీ నేతలందరితో చర్చలు జరుపుతున్నారు. వైసీపీ నుంచి టిఆర్ఎస్లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కూడా తిరిగి వైసీపీలోకి రప్పించేందుకు షర్మిళ ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు. తనకు షర్మిళ అంటే గౌరవమే కానీ టిఆర్ఎస్ను విడిచిపెట్టి రాదలచుకోలేదని పొంగులేటి స్పష్టం చేశారు. జిల్లాలో వైసీపీ నేతలతో కూడా సత్సంబంధాలున్నాయని కానీ వారికి తన సహాయసహకారాలు లభించవని గ్రహించాలని పొంగులేటి అన్నారు. మంత్రి కేటీఆర్తో తనకు చక్కటి సంబందాలున్నాయని తెలిపారు.