నేటి సాయంత్రం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన

February 26, 2021


img

కేంద్ర ఎన్నికల కమీషన్ శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించనుంది. ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో అసోం, కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరుగవలసి ఉంది. ఇటీవలే పుదుచ్చేరిలో రాజకీయ సంక్షోభం తలెత్తడంతో నారాయణస్వామి నేతృత్వంలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. దాంతో కేంద్రప్రభుత్వం పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించింది. కనుక నాలుగు రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరి శాసనసభకు కూడా ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమీషన్ భావిస్తోంది. 



Related Post