రేపు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం ఏడు పద్మవిభూషన్, 10 పద్మ భూషణ్, 102 పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యంకు పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్రంలో పద్మశ్రీకి ఎంపికైన వారి వివరాలు:
1. తెలంగాణలో కనకరాజు (ఆర్ట్)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్మశ్రీ అవార్డుకు ఎంపికైనవారు:
1. ఆశావాది ప్రకాష్ రావు ( సాహిత్యం, విద్య)
2. రామస్వామి అన్నవరపు (ఆర్ట్)
3. నిడుమోలు సుమతి (ఆర్ట్)
పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైనవారు:
1. స్వర్గీయ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం (ఆర్ట్) తమిళనాడు
2. షింజోఅబే (ప్రజా వ్యవహారాలు) జపాన్ మాజీ ప్రధానమంత్రి
3. నరిందర్ సింగ్ కపానీ (సైన్స్ అండ్ ఇంజనీరింగ్) అమెరికా
4. సుధాంశు సహూ (ఆర్ట్) ఒడిశా
5. మౌలానా వాహిదుద్దీన్ ఖాన్ (ఆధ్యాత్మికత)
6. డా.బెల్లే మొనప్ప హెగ్డే (వైద్యం) కర్ణాటక
7. శ్రీబీబీ లాల్: (ఆర్కియాలజీ) ఢిల్లీ
పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైనవారు:
1. స్వర్గీయ రాంవిలాస్ పాశ్వాన్: (ప్రజా వ్యవహారాలు) బిహార్, మాజీ కేంద్రమంత్రి
2. తరుణ్ గగోయ్ (ప్రజా వ్యవహారాలు) అసోమ్ మాజీ ముఖ్యమంత్రి
3. స్వర్గీయ కేశుభాయ్ పటేల్ (ప్రజా వ్యవహారాలు) గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి
4. సుమిత్రా మహాజన్ (ప్రజా వ్యవహారాలు) మధ్యప్రదేశ్, లోక్ సభ మాజీ స్పీకర్
5. నృపేంద్ర మిశ్రా: (సివిల్ సర్వీస్) ఉత్తరప్రదేశ్
6. తార్లోచన్ సింగ్: (ప్రజా వ్యవహారాలు) హర్యానా
7. కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర (ఆర్ట్) కేరళ
8. రజినీకాంత్ దేవిదాస్ షరోఫ్: (వ్యాపారం మరియు పరిశ్రమలు) మహారాష్ట్ర
9. చంద్రశేఖర్ కంబర: (సాహిత్యం, విద్య)
10. కల్బే సాదిక్: (ఆధ్యాత్మికం) ఉత్తరప్రదేశ్