ఓజీ షూటింగ్ సమాప్తం…. సెప్టెంబర్ 25న విడుదల

సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా తీస్తున్న యాక్షన్ ప్యాక్ సినిమా ‘ఓజీ’ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న అభిమానులకు ఓ శుభవార్త. ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది.

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ విషయం తెలియజేస్తూ పవన్‌ కళ్యాణ్‌ రివాల్వర్‌తో ఘాట్ చేస్తున్నట్లు ఓ పోస్టర్ ఎక్స్‌ మీడియాలో పోస్ట్ చేసింది. “అన్ని షాట్స్ ఫైరింగ్ పూర్తయింది.. ఇక థియేటర్ల వంతు.. ఓజీ యుగం అందరినీ ఆశ్చర్యపరచబోతోంది.. దే కాల్ హిమ్ ఓజీ సెప్టెంబర్ 25న విడుదల కాబోతోందని తెలియజేసింది. 

ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు. శుభలేఖ సుధాకర్, ప్రకాష్ రాజ్, అజయ్ ఘోష్, అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి, హరీష్ శంకర్‌ ఉత్తమన్, అభిమన్యు సింగ్‌ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: సుజీత్, సంగీతం: థమన్; కెమెరా: రవి కె చంద్రన్; ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. 

రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.