
శేఖర్ కమ్ముల, నాగార్జున, ధనుష్, రష్మిక కాంబినేషన్లో ‘కుబేర’ నుంచి ముచ్చటగా మూడో పాట విడుదలైంది. చైతన్య పింగళి వ్రాసిన ‘పిప్పీ పిప్పీ డుమ్ డుమ్..’ అంటూ సాగే ఈ పాటని దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచి సంగీతం అందించగా, ఇంద్రావతి చౌహాన్ పాడారు. లేడీస్ హాస్టల్లో అమ్మాయిల జీవితాలు ఏవిదంగా ఉంటాయో తెలియజేస్తూ సాగిన పాటకి రష్మిక మందన బృందం చేసిన డాన్స్ బాగుంది.
ఈ సినిమాలో రష్మిక మందన, జిమ్ సరబ్, సాయాజీ ఏక్నాధ్ షిండే తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ: శేఖర్ కమ్ముల, చైతన్య పింగళి, దర్శకత్వం: శేఖర్ కమ్ముల, సంగీతం: దేవి శ్రీప్రసాద్, కెమెరా: నికేత్ బొమ్మి చేస్తున్నారు.
శ్రీ వేంకటేశ్వర సినిమాస్, ఎల్ఎల్పి అమిగోస్ క్రియెషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రాంమోహన్ రావు కలిసి పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్న కుబేరా ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.