
పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా చేసిన ‘హరిహర వీరమల్లు’ నుంచి మరో పాట విడుదల చేసి, ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న అభిమానులకు సంతోషం కలిగించారు.
తార తార నా కళ్ళు.. వెన్నెల పూత నా ఒళ్ళు.. అంటూ చిన్న చిన్న పదాలతో చక్కటి సాహిత్యం రుచి చూపారు గీత రచయిత శ్రీ హర్ష ఏమని. ఈ పాటని కీరవాణి స్వరపరచగా లిప్సికా భాష్యం, ఆధిత్య అయ్యంగార్ చక్కగా పాడారు.
చారిత్రిక నేపధ్యంతో తీస్తున్న హరిహర వీరమల్లులో ఐటం సాంగ్కు వంటి ఇటువంటి పాట, డాన్స్ పెట్టడం కాస్త విచిత్రంగా ఉన్నప్పటికీ, గతంలో అనేక పౌరాణిక, చారిత్రిక, జానపద సినిమాలలో జ్యోతిలక్ష్మీ, జయమాలిని వంటివారితో ఐటం సాంగ్స్ పెట్టేవారు. కనుక ఇదేం పెద్ద విచిత్రం కాదు.
ఈ సినిమాలో బాలీవుడ్ నటులు బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, జాక్విలిన్ ఫెర్నాండస్, అర్జున్ రాంపాల్, విక్రమ్ జీత్, జిష్ణుసేన్ గుప్తా, నోరాహి ఫతేహి, దక్షిణాది నుంచి ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, పూజిత పొన్నాడ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
హరిహర వీరమల్లుని క్రిష్ దర్శకత్వంలో మొదలుపెట్టగా జ్యోతీ కృష్ణ దర్శకత్వంలో పూర్తి చేస్తున్నారు. ఈ సినిమాకి కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: క్రిష్, జ్యోతి కృష్ణ, సంగీతం: ఎంఎం కీరవాణి, పాటలు: స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చంద్రబోస్, కెమెరా: జ్ఞానశేఖర్, ఎడిటింగ్: శ్రవణ్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, శామ్ కౌశల్, దిలీప్ సుబ్బరాయన్.
మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యాననర్లో ఏఎం రత్నం భారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నిర్మించిన హరిహర వీరమల్లు జూన్ 12 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.