కీరవాణి పాట… ఇళయరాజా సంగీతం

ఇళయరాజా, కీరవాణి ఇద్దరూ సంగీత దర్శకులే. వారిద్దరూ కలిసి ఓ పాట చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలియాలంటే ‘షష్టిపూర్తి’ సినిమా నుంచి విడుదలైన ఈ పాట వినాల్సిందే. వీరిద్దరూ సుమారు 38 ఏళ్ళ క్రితం రాజేంద్ర ప్రసాద్ సూపర్ హిట్ సినిమా ‘లేడీస్ టైలర్’లో కలిసి పనిచేశారు. ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ సినిమా ‘షష్టిపూర్తి’లో కలిశారు. “ఏదో ఏ జన్మలోనో..’ అంటూ సాగే కీరవాణి వ్రాసిన పాటకు ఇళయరాజా స్వరపరిచి సంగీతం అందించగా అనన్య భట్ అద్భుతంగా పాడారు. 

ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, అర్చన, రోపేష్, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రలు చేశారు. ప్రభాస్‌ రీను, చలాకీ చంటి, జబర్దస్త్ రామ్, లత, శ్వేత, ఋషి, చక్రపాణి ఆనంద, అచ్యుత కుమార్‌, మురళీధర్ గౌడ్, అనిల్‌ తదితరులు నటించారు. 

ఈ సినిమాకు కధ, డైలాగ్స్, దర్శకత్వం: పవన్ ప్రభ, సంగీతం: ఇళయరాజా, కెమెరా: రామ్ చరణ్‌, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ చేశారు. 

మాయి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపేష్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది.