
వెంకటేష్, మీనాక్షీ చౌదరి, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా నుంచి మీనూ.. లిరికల్ సాంగ్ గురువారం మద్యాహ్నం విడుదలైంది.
అనంత్ శ్రీరామ్ వ్రాసిన ఈ పాటని భీమ్స్ సిసిరోలియో చక్కగా స్వరపరిచి ప్రాణవి ఆచార్యతో కలిసి హుషారుగా పాడారు.
ఈ ముక్కోణపు క్రైమ్ ధ్రిల్లర్ సినిమాలో వెంకటేష్ పోలీస్ ఆఫీసరుగా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, పృధ్వీరాజ్, శ్రీనివాస్ అవసరాల, ఉపేంద్ర లిమాయే, విటీ గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, ఆనంద్ రాజ్, సాయి శ్రీనివాస్, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్ర, చిట్టి తదితరులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: అనిల్ రావిపూడి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: సమీర్ రెడ్డి, కొరియోగ్రఫీ: భాను మాష్టర్, ఎడిటింగ్: తమ్మిరాజు, స్టంట్స్: రియల్ సతీష్ చేశారు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ బ్యానర్పై శిరీష్ ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. డబ్బింగ్ పనులు జోరుగా సాగుతున్నాయి. జనవరి14న సంక్రాంతి పండుగనాడే ఈ సినిమా విడుదల కాబోతోంది.