జీబ్రా నుంచి మరో లిరికల్ తేరే బినా....

ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో సత్యదేవ్, డాలీ ధనుంజయ ప్రధాన పాత్రలలో వస్తున్న ‘జీబ్రా’ సినిమా నుంచి రెండో లిరికల్ సాంగ్‌ ఈరోజు సాయంత్రం విడుదల చేశారు. తేరే బినా... అంటూ సాగే ఈ పాటని కృష్ణ కాంత్ వ్రాయగా, సంగీత దర్శకుడు రవి బస్రూర్ చాలా మృధుమధురంగా స్వరపరిచి చక్కటి సంగీతం అందించారు. ఈ పాటలో డాలీ ధనుంజయ్, అమృతా అయ్యర్ మీద చిత్రీకరించారు. 

ఈ సినిమాలో  సునీల్, సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్, సత్య, జెనిఫర్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.

ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మజా ఫిలిమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై ఎస్‌న్‌ రెడ్డి, ఎస్‌ పద్మ, సుందరం, దినేష్ సుందరం కలిసి పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకి కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: ఈశ్వర్ కార్తీక్, డైలాగ్స్: మీరక్, సంగీతం: రవి బస్రూర్, కెమెరా: సత్యా పొన్మార్, కొరియోగ్రఫీ: బాబా బాస్కర్, ఆర్కే, స్టంట్స్‌: రాబిన్‌హుడ్ సుబ్బు, ఎడిటింగ్: అనిల్ క్రిష్ చేశారు. నవంబర్‌ 22న జీబ్రా విడుదల కాబోతోంది.