విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ఖుషీ సినిమా నుంచి ఎదకు ఒక గాయం అంటూ సాగే నాల్గవ లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. దర్శకుడు శివ నిర్వాణ వ్రాసిన ఈ పాటకు సంగీత దర్శకుడు హషమ్ అబ్దుల్ వాహేబ్, దివ్యా మెనన్తో కలిసి హృదయాలను కదిలించేలా ఆలపించారు.
ఖుషీ సినిమాలో మురళీ శర్మ, అలీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, జయరాం, సచిన్ కేడ్కర్, లక్ష్మి, శ్రీకాంత్ అయ్యంగార్, రోహిణి తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ కలిసి ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కెమెరా: మురళి జి, సంగీతం: హషమ్ అబ్దుల్ వాహేబ్, కొరియోగ్రఫీ: దిల్రాజు సుందరం, బృంద, పోనీ వర్మ అందిస్తున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన ఖుషీ విడుదల కాబోతోంది.