
కార్తికేయ గుమ్మకొండ, నేహాశెట్టి జంటగా చేస్తున్న బెదురులంక-2012 సినిమా ట్రైలర్ను రామ్ చరణ్ తేజ్ గురువారం విడుదల చేశారు. ఈ సినిమాతో క్లాక్స్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
గోదావరి జిల్లాల నేపద్యంలో అనేక రూరల్ డ్రామా సినిమాలు వచ్చాయి. ఇది కూడా అటువంటిదే కానీ దీనిలో పేరుకి భిన్నంగా మంచి కామెడీ కూడా ఉంటుందని నిర్మాత ముప్పనేని రవీంద్ర బెనర్జీ తెలిపారు. 2012లో యుగాంతం అవుతుందని, అప్పుడు ఈ భూమండలం మీద సకలజీవరాసులు నశించిపోతాయని ప్రపంచవ్యాప్తంగా పుకార్లు వచ్చాయి. అదే కధాంశంగా తీసుకొని ఓ పల్లెటూరులో ఏమి జరిగిందనేది ఈ సినిమాలో చూపిన్నట్లు ట్రైలర్ చూస్తే అర్దమవుతుంది. కనుక నిర్మాత బెనర్జీ చెప్పిన్నట్లు సినిమాలో మంచి కామెడీ పండిన్నట్లే ఉంది.
ఈ సినిమాలో అజయ్ ఘోష్, సత్యా, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రామ్ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సురభి పార్వతి, కిట్టయ్య,, అనితానాథ్, దివ్యా నార్ని ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాను లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ముప్పనేని రవీంద్ర బెనర్జీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కెమెరా: సాయి ప్రకాష్, సన్నీ, ప్రకాష్-సన్నీ, కొరియోగ్రఫీ: బృంద మాస్టర్, స్టంట్స్: అంజి, పృధ్వీ రాజ్, పాటలు: స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి, కిట్టు విస్సాప్రగడ, కృష్ణ చైతన్య, సంగీతం: మణిశర్మ అందిస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 25వ తేదీన విడుదల కాబోతోంది.