మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరం తేజ్, కేతిక శర్మ తదితరులు నటించిన ‘బ్రో’ జూలై 28న విడుదలై మంచి కలక్షన్స్తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో ‘శ్యామ్ బాబు’ పాత్రతో తనను అవమానించరంటూ ఏపీ మంత్రి అంబటి రాంబాబు గల్లీ నుంచి ఢిల్లీ వరకు చేస్తున్న హడావుడితో బ్రోకి మంచి ఉచిత ప్రమోషన్ లభిస్తోంది. ఈ సినిమాను నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం నిన్న సాయంత్రం బ్రో మేకింగ్ వీడియోని విడుదల చేసింది. సినిమా మేకింగ్ వీడియోలు ఎప్పుడూ చాలా ఆసక్తికరంగానే ఉంటాయి. బ్రోలో హేమాహేమీలు ఉన్నందున ఈ మేకింగ్ వీడియో కూడా ఇంకా ఆసక్తికరంగా ఉంది.
మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు జీస్టూడియోస్ బ్యానర్లపై టిజి విశ్వ ప్రసాద్ నిర్మించారు.