
అవును నిజమే... కొడైకెనాల్లో దేవ్ మోహన్తో రష్మిక మందన రొమాన్స్ చేస్తోంది. అయితే నిజజీవితంలో కాదు రెయిన్ బో సినిమా కోసం. నూతన దర్శకుడు శాంతరూబన్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమాలో మొదట హీరోయిన్గా సమంతను తీసుకోవాలనుకొన్నారు. కానీ ఆమె మయొసైటీస్ వ్యాధికి గురవడం, ఆ తర్వాత సినిమాలతో బిజీ అయిపోవడంతో ఆమె స్థానంలో పుష్ప సినిమాతో దేశమంతా పేరు మారుమ్రోగిపోతున్న రష్మిక మందనను తీసుకొన్నారు.
మరో విశేషమేమిటంటే రెయిన్బో హీరోయిన్ ఓరియంటెడ్ మూవీగా తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. కనుక ఈ సినిమా పూర్తి బాధ్యత రష్మిక మందన భుజాలపైనే ఉంటుంది. ఈ నెల 3న ఈ సినిమాలో పూజా కార్యక్రమాలు జరుపుకొన్న తర్వాత కొన్నిరోజులు హైదరాబాద్లో షూటింగ్ చేశారు. ఇప్పుడు రెండో షెడ్యూల్ కోసం కొడైకెనాల్ చేరుకొన్నారు. అక్కడ 15 రోజులు షూటింగ్ చేయవచ్చని సమాచారం.
ఈ సినిమాకు ఫోటోగ్రఫీ: కెఎం భాస్కరన్, సంగీతం: జస్టిన్ ప్రభాకరన్ అందిస్తున్నారు.