
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, కియరా అద్వానీ, అంజలి హీరో హీరోయిన్లుగా ‘ఆర్సీ15’ అనే వర్కింగ్ టైటిల్తో సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. శుక్రవారం ఉదయం నుంచి ఈ చిత్ర బృందం కర్నూలు పట్టణంలో కొండారెడ్డి బురుజు వద్ద ఈ సినిమా షూటింగ్ చేస్తోంది. షూటింగ్ జరుగుతున్న వైపు కోటని పూలతో అందంగా అలంకరించి అభ్యుదయం పార్టీ అనే బ్యానర్ తగిలించారు.
రామ్ చరణ్, శ్రీకాంత్, రాజీవ్ కనకాల తదితరులు కోటపై నిలబడి మైకులో ప్రజలని ఉద్దేశ్యించి ప్రసంగిస్తున్న సన్నివేశాన్ని చిత్రీకరించారు. రామ్ చరణ్ సినిమా షూటింగ్ జరుగుతోందని తెలిసి వేలాదిగా ఆయన అభిమానులు కొండారెడ్డి బురుజు వద్దకి తరలివచ్చారు. ఎలాగూ ఈ సన్నివేశంలో ప్రజలు కూడా అవసరం కనుక వారినీ కలిపి చిత్రీకరించారు. ఎడిటింగ్లో కత్తెరపడకుంటే వారు కూడా సినిమాలో కనిపిస్తారు.
ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తండ్రి పాత్రకి జోడీగా అంజలి, కొడుకు పాత్రకి జోడీగా కియరా అద్వానీ, విలన్గా ఎస్ జే సూర్య, ఇంకా సునీల్, నాజర్, రఘుబాబు, జయరాం, సముద్రఖని, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని రూ.170 కోట్ల భారీ బడ్జెట్తో దిల్రాజు, అల్లు శిరీష్ కలిసి శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజు అందించిన కధతో రూపొందున్న ఈ సినిమాకు ‘అధికారి’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. కానీ ఇంకా ధృవీకరించాల్సి ఉంది.
ఈ సినిమాకి కెమెరా: తిరు, ఆర్ రత్నవేలు, సంగీతం: థమన్ అందిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి హైదరాబాద్, విశాఖపట్నం, మహారాష్ట్ర, పంజాబ్లో కొన్ని కీలక సన్నివేశాలు తీశారు. 2023, వేసవి సెలవులలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.