
రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, కృతిక శెట్టి, మడోన్నా సెబాస్టియన్స్ హీరోయిన్స్గా రూపొందుతున్న చిత్రం శ్యామ్ సింగరాయ్. నాని కెరీర్లో చారిత్రిక నేపధ్యంతో తెరకెక్కుతున్న తొలి చిత్రం ఇది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ రూ.10 కోట్లకు జెమినీ టీవీ దక్కించుకొంది. నానీ కెరీర్లో ఇదీ మరో కొత్త రికార్డే.
కోల్కతా బ్యాక్ డ్రాప్లో రూపొందిన ఈ సినిమాలో నాని విప్లవ రచయితగా, సాయిపల్లవి దేవదాసిగా చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నాని రెండు వేర్వేరు పాత్రలు పోషించినట్లు సమాచారం.
నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయిపల్లి శ్యామ్ సింగరాయ్ని నిర్మించారు. ఈ నెల 24వ తేదీన విడుదల కాబోతోంది.
కధ: జంగ సత్యదేవ్; సంగీతం: మికీ జె మేయర్.