తెలంగాణ ప్రభుత్వం జైన్ కమ్యూనిటీని మత మైనారిటీగా ప్రకటించింది.
ఢిల్లీకి చెందిన ఆల్ ఇండియా దిగంబర్ జైన్ ఆర్గనైజేషన్ సమన్వయ కమిటీ, ప్రభుత్వానికి తమ సమస్య లిఖిత పూర్వకంగా సమర్పించిన తర్వాత, మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ (MWD), ప్రభుత్వ ఆర్డర్ జారీ చేసింది. సమైఖ్యాంధ్ర లో జైన్ కమ్యూనిటీ అధికారికంగా మత మైనారిటీగా గుర్తించబడింది అని కమిటీ చెబుతూ, అదే స్టేటస్ ని మళ్ళీ ఇవ్వవలసినదిగా కమిటీ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది.
2001 జనాభా లెక్కల గణాంకాల ప్రకారం, 3.51 కోట్ల రాష్ట్ర జనాభాలో, ఆ, 26.690 జైనులు, అంటే 0.075 శాతం మంది జైనులు ఉన్నారు. "జైనులు, హిందూ మతం లో కాకుండా, ఒక ప్రత్యేకమైన మతం కి చెందిని వారు" అని GO యొక్క ఒక సారాంశంలో ఉంది.
ఇదే విషయం పై మాట్లాడుతూ MWD కార్యదర్శి సయ్యద్ ఓమర్ Jaleel, "సంస్థ ఇటీవల మమ్మల్ని కలిసి విషయం చెప్పారు. ప్రభుత్వం తదుపరి తెలంగాణ గెజిట్ సంచికలో ఒక నోటిఫికేషన్ ప్రచురిస్తుంది," అన్నారు. జైన్ సంఘం సభ్యులు, ఆ ప్రకటనని ఆహ్వానిస్తూ, ముస్లింలు, క్రైస్తవులు మరియు సిక్కులు లాగే, తమకి కూడా సమాన హోదా లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.