సంబంధిత వార్తలు
తెలంగాణ సీఎస్ శాంతికుమారి త్వరలో పదవీ విరమణ చేయబోతున్నారు. ఆమె స్థానంలో గత 11 ఏళ్ళుగా ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శిగా చేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి కే రామకృష్ణా రావుని నియమించబోతున్నట్లు తెలుస్తోంది.
ఎన్నడూ చిర్నవ్వుతో కనిపించని శాంతి కుమారి 1989 ఐఏఎస్ బ్యాచ్ చెందినవారు. ఆమె 2023, జనవరి 11 న తెలంగాణ ప్రభుత్వం ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఆమె స్థానంలో 1990 బ్యాచ్కి చెందిన కే రామకృష్ణా రావుని బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆయన ఈ పదవిలో 2026 ఆగస్ట్ వరకు కొనసాగి తర్వాత పదవీ విరమణ చేస్తారు.