బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మొయినాబాద్ పోలీసులు నోటీస్ ఇచ్చారు. గత నెల తోల్కట్ట ఫామ్హౌస్లో కోడి పందేలు, కేసినో నిర్వహించిన కేసులో విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు.
కోడి పందేలు, కేసినోలో పాల్గొన్న 64 మందిని పోలీసులు ఈ కేసులో అదుపులో తీసుకున్నారు. ఆ ఫామ్హౌస్ యాజమాని పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కావడంతో ఆయనను కూడా నిందితుడుగా చేర్చి విచారణకు రావాలంటూ నోటీస్ ఇచ్చారు. పోలీసులు బుధవారం సాయంత్రం మాదాపూర్లో ఆయన నివాసానికి వెళ్ళారు. కానీ ఆ సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో గోడకు నోటీస్ అంటించారు.
పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఈ కేసుపై స్పందిస్తూ తాను ఫామ్హౌస్ని ఓ వ్యక్తికి లీజుకి ఇచ్చానని కనుక దానిలో జరిగిన కోడి పందాలు, క్యాసినోతో తనకు ఎటువంటి సంబందమూ లేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతోనే తన పేరుని ఈ కేసులో చేర్పించిందని అన్నారు.