బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు పార్టీ ముఖ్య నేతలతో కలిసి పాతబస్తీలో ఛార్మినార్ వద్దకు చేరుకుని, రాష్ట్ర ప్రభుత్వపు తాజా నిర్ణయాని నిరసిస్తూ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “గత పదేళ్ళలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ఎంతగానో అభివృద్ధి చెందింది. కనుక దశాబ్ధి ఉత్సవాలలో రాష్ట్రాభివృద్ధి గురించి చెప్పుకోకుండా రాష్ట్ర రాజముద్రలో ఈ మార్పులు చేర్పులు దేనికి? ఇప్పుడు అంత అవసరం ఏమోచ్చింది?
తెలంగాణను సాధించి అభివృద్ధి చేసిన కేసీఆర్ పేరుని కనబడకుండా చేయాలనే తాపత్రయం దేనికి? పాలన, అభివృద్ధి, హామీల అమలు గురించి ఆలోచించకుండా ఈ మూర్ఖపు ఆలోచనలు దేనికి?
అనేక దశాబ్ధాలుగా ఛార్మినార్ హైదరాబాద్ నగరానికి ప్రతీకగా నిలుస్తోంది. కాకతీయ తోరణం తెలంగాణ చారిత్రిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. అటువంటి వాటిని అత్యవసరంగా మార్చాల్సిన అవసరం ఏమిటి? ప్రభుత్వ నిర్ణయాన్ని మేము ఖండిస్తున్నాము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలోచనని విరమించుకొని పాలనపై దృష్టి పెట్టాలని కోరుతున్నాము,” అని కేటీఆర్ అన్నారు.
బీఆర్ఎస్ నాయకులతో కలిసి చార్మినార్ను సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
— BRS Party (@BRSparty) May 30, 2024
కేటీఆర్ కామెంట్స్ 👇👇
🔹గత పదేళ్లలో ప్రభుత్వం ద్వారా జరిగిన మంచి గురించి ప్రజలకు చెప్పాలి
🔹కానీ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి… pic.twitter.com/hu6EnVijNM