ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం సలార్కు సీక్వెల్గా మళ్ళీ వారి కాంబినేషన్లో సలార్- శౌర్యాంగ పర్వ పేరుతో రాబోతోంది.
ఈ నెలాఖరు నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవబోతోంది. దీని కోసం హైదరాబాద్లో ఓ భారీ సెట్ వేశారు. తొలి షెడ్యూల్లో ప్రభాస్, పృధ్వీరాజ్ సుకుమార్, పాల్గొంటారని తెలుస్తోంది. ఈ నెలాఖరుకి షూటింగ్ మొదలుపెట్టి డిసెంబర్లోగా 50 శాతం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
ప్రభాస్, పృధ్వీరాజ్ సుకుమార్ ఇద్దరూ మరికొన్ని సినిమాలు ఒప్పుకున్నందున ముందుగా వారిద్దరూ ఉండే సన్నివేశాలను పూర్తి చేసి తర్వాత మిగిలిన వారితో షూటింగ్ చేసుకునేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
షూటింగ్తో పాటు సమాంతరంగా విఫెక్స్ పనులను కూడా పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నారు. హైదరాబాద్లో మొదటి షెడ్యూల్ పూర్తయిన తర్వాత బెంగళూరు శివార్లలో వేస్తున్న సెట్స్లో రెండో షెడ్యూల్ షూటింగ్ చేయబోతున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో కూడా జగపతిబాబు, శ్రుతీ హాసన్, బాబీ సింహా, శ్రీయ రెడ్డి, బ్రహ్మాజీ, షఫీ, బాలీవుడ్ సీనియర్ నటుడు టిను ఆనంద్, రామచంద్రరాజు, సప్తగిరి, పృధ్వీరాజ్, ఝాన్సీ, మధు గురుస్వామి, నాగ మహేశ్, దుబ్బాక భాస్కరరావు, జెమిని సురేశ్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.