మునుగోడు ఉపఎన్నికల ఫలితాలు: మ.12.30 గంటలకు

మునుగోడు ఉపఎన్నికల ఓట్ల లెక్కింపులో కొద్దికొద్దిగా టిఆర్ఎస్‌ ఆధిక్యత పెరుతోంది. కొద్ది సేపటి క్రితం 5వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. దీనిలో టిఆర్ఎస్‌కి 6,162 ఓట్లు, బిజెపికి 5,245 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 2,670 ఓట్లు పోల్ అయ్యాయి. ఈ రౌండ్‌లో టిఆర్ఎస్‌ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన సమీప బిజెపి అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 917 ఓట్లు సాధించారు. ఇక 5 రౌండ్లలో కలిపి టిఆర్ఎస్‌కి 32,225 బిజెపికి 30,974, కాంగ్రెస్‌కి 9,656 ఓట్లు పోల్ అయ్యాయి. ఐదు రౌండ్లలో కలిపి టిఆర్ఎస్‌కి కేవలం 1,251 ఓట్లు ఆధిక్యతలో కొనసాగుతోంది.