రేపు దసరా పండుగ.
రేపే తెలంగాణా మళ్ళీ కొత్త జిల్లాలలో నూతన రూపంతో తనని తాను పునరవిష్కరించుకోబోతోంది.
అందుకు ఉదయం 11.12 నిమిషాలు దివ్య ముహూర్తంగా నిర్ణయించారు పండితులు. కనుక అన్ని
జిల్లాలలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యాలయాలు ఆ సమయంలో ప్రారంభించబోతున్నారు.
అప్పటి నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనేక అధికారిక, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.
కొత్త జిల్లాలకి కలెక్టర్ల పేర్లని ఈరోజు సాయంత్రమే ప్రభుత్వం ప్రకటించింది.
వారి వివరాలు:
యాదాద్రి జిల్లా-అనితా
రామచంద్రన్; జోగులాంబ జిల్లా -రజత్ కుమార్; రాజన్న సిరిసిల్ల జిల్లా-కృష్ణ భాస్కర్;
జయశంకర్ జిల్లా –మురళి; వరంగల్ అర్బన్
జిల్లా-అమ్రపాలి; మహబుబాబాద్ జిల్లా- ప్రీతిమీనన్; మెదక్ జిల్లా- భారతి హోలికేరి;
జిగిత్యాల జిల్లా-శరత్; ఆదిలాబాద్ జిల్లా-జ్యోతి బుద్ధప్రసాద్; నిర్మల్ జిల్లా-ఇలంబర్తి,
ఆసిఫాబాద్
జిల్లా-చంపాలాల్, వనపర్తి జిల్లా-శ్వేతా మహంతి; నాగర్ కర్నూల్ జిల్లా- శ్రీధర్;
వికారాబాద్
జిల్లా-దివ్య; మల్కాజ్‑గిరి జిల్లా-ఎంవీ రెడ్డి; వరంగల్ రూరల్ జిల్లా-ప్రశాంత్;
సిద్ధిపేట జిల్లా-వెంకట్రామిరెడ్డి; సూర్యాపేట
జిల్లా-సురేంద్ర మోహన్;
పెద్దపల్లి జిల్లా-అలుగు వర్షిణి; కామారెడ్డి
జిల్లా-సత్యనారాయణ