ఓవైసీ-మిధాని ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం నేడే

హైదరాబాద్‌ నగరంలో ఓవైసీ జంక్షన్ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్‌ను పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ఈరోజు ఉదయం 10.30 గంటలకు ప్రారంభోత్సవం చేయనున్నారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి (ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా రూ.80 కోట్లతో ఈ ఫ్లైఓవర్ నిర్మించారు. 

దీంతో నగరంలో కంచన్‌బాగ్ నుంచి ఓవైసీ హాస్పిటల్‌ జంక్షన్ మీదుగా ఎల్బీ నగర్‌ ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సులువుగా చేరుకోవచ్చు.