కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డికి కరోనా

కాంగ్రెస్‌ ఎంపీ, ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి కరోనా బారిన పడ్డారు. ఈవిషయం ఆయన స్వయంగా ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. వైద్యుల సూచన మేరకు హోమ్ క్వారెంటైన్‌లో ఉంటున్నట్లు తెలిపారు. గత రెండు వారాలుగా తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు.