
సిఎం కేసీఆర్ నేడు విజయవాడకు అక్కడి నుంచి నేరుగా డిల్లీకి వెళ్ళనున్నారు. ఆయన నిన్న రాత్రే విజయవాడ చేరుకొని ఈరోజు ఉదయం కనకదుర్గమ్మవారి దర్శనం చేసుకొంటారనుకొన్నప్పటికీ పని ఒత్తిడి వలన ఆయన పర్యటనలో చిన్న మార్పు జరిగింది.
ఈరోజు ఉదయం 10.00 గంటలకు హైదరాబాద్ బేగంపేట విమాశ్రయం నుంచి బయలుదేరి 10.55 గంటలకు గన్నవరం విమాశ్రయం చేరుకొంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయవాడలోని గేట్-వే హోటల్ చేరుకొని కాసేపు విశ్రాంతి తీసుకొంటారు. మధ్యాహ్నం 12.00 గంటలకు స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు బయలుదేరి 12.23 గంటలకు జరుగబోయే జగన్మోహన్రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు.
మళ్ళీ గేట్-వే హోటల్ చేరుకొని భోజనానంతరం మధ్యాహ్నం 2.00 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి డిల్లీకి బయలుదేరుతారు. డిల్లీలో రాత్రి 7 గంటలకు జరిగే నరేంద్రమోడీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. సిఎం కేసీఆర్ను ఆహ్వానిస్తూ విజయవాడలో పలుప్రాంతాలలో వైసీపీ నేతలు ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేశారు.