ప్రముఖ కవి పడాల రామారావు మృతి

తెలంగాణలోని ప్రముఖ కవులలో ఒకరైన పడాల రామారావు శుక్రవారం రాత్రి నిజామాబాద్‌ పట్టణంలో తన నివాసంలో గుండెపోటుతో కనుమూశారు. ఆయన భావనా సాహితీ, సామాజిక సాంస్కృతిక సమాఖ్యను స్థాపించి అనేక మంది వర్ధమాన కవులను ప్రోత్సహించారు. పడాల రామారావు స్వస్థలం మోర్తాడ్ మండలంలోని బషీరాబాద్. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. పడాల మృతి పట్ల ఆయన శిష్యులు, అభిమానులు, సాటి కవులు సంతాపం తెలియజేస్తున్నారు.