నేటి నుంచి తెలంగాణలో కోవిడ్ బూస్టర్ డోస్ పంపిణీ

April 19, 2023
img

దేశంలో మళ్ళీ కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నందున కరోనా కట్టడి ప్రయత్నాలలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి  రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బూస్టర్ డోసుల పంపిణీ ప్రారభిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్-ఈ తయారుచేసిన ‘కార్బేవేక్స్’ 5 లక్షల టీకాలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి పంపిణీ చేస్తోంది. 

మొదటి రెండు డోసులు కొవీషీల్డ్ లేదా కోవాక్సిన్ టీకాలు వేసుకొన్నవారు ఎటువంటి సందేహం లేకుండా ఈ కార్బేవేక్స్ టీకాలు వేసుకోవచ్చని వైద్యశాఖ అధికారులు తెలిపారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, టీకా కేంద్రాలలో ఈ బూస్టర్ డోస్ వాక్సిన్ అందుబాటులో ఉంటుందని కనుక మొదటి రెండు డోసులు వేసుకొన్నవారు ఈ బూస్టర్ డోస్ కూడా వేసుకోవాలని రాష్ట్ర ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.  


Related Post