భారత్‌లో రోజుకి 3.82 లక్షల కేసులు నమోదు

May 05, 2021
img

కరోనా కేసులు, మరణాల విషయంలో భారత్‌ ప్రపంచంలో ఏ దేశానికి అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా 3,82,315 మంది కొత్తగా కరోనా బారిన పడ్డారు. దేశవ్యాప్తంగా 3,780 మంది ఆ మహమ్మారి కోరల్లో చిక్కుకొని చనిపోయారు. దీంతో భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రెండు కోట్లు, మృతుల సంఖ్య 2.26 లక్షలు దాటిపోయింది. 

కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ కొలుకొంటున్నవారి సంఖ్య కూడా గణనీయంగా పెరగడం కాస్త ఊరటనిచ్చే విషయమే. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా కొత్తగా 3.82 లక్షల మంది కరోనా బారినపడగా, మరో 3.38 లక్షల మంది కోలుకొన్నారు. అంటే రికవరీ శాతం మళ్ళీ పెరుగుతోందన్నమాట! 

ఇప్పటికే పలు రాష్ట్రాలలో పాక్షిక, పూర్తిస్థాయి కర్ఫూ, లాక్‌డౌన్‌ విధిస్తూండటం, దేశవ్యాప్తంగా రెండు డోసుల టీకాలు వేసుకొన్నవారి సంఖ్య మెల్లగా పెరుగుతుండటంతో మరో 10 రోజులలో దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తోంది. 

Related Post