అరవై ఏళ్ళు పైబడినవారికి మార్చి 1 నుంచి కరోనా టీకాలు

February 26, 2021
img

రాష్ట్రంలో మార్చి ఒకటో తేదీ నుండి 60 ఏళ్ల పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఆరోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కరోనా వ్యాక్సిన్ తీసుకొనేందుకు వచ్చేవారు ముందుగా కోవిన్ మొబైల్ యాప్‌లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. కరోనా వ్యాక్సిన్‌కు వచ్చేవారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఏదైనా గుర్తింపు కార్డు వెంట తీసుకెళ్లాలని తెలిపారు. రాష్ట్రంలో 60 సంవత్సరాలు పైబడిన వారు సుమారు 55 లక్షల మంది ఉన్నారని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ సురక్షితమైనది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని డాక్టర్ శ్రీనివాస్ రావు హామీ ఇచ్చారు.


Related Post