ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం 16,347 పోస్టుల భర్తీకి నేడు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించింది. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. డీఎస్సీ అంటే అదో అంతులేకుండా సాగే ప్రక్రియ అనే భావన సర్వత్రా ఉంది. కోర్టు కేసులతో అలాగే సాగుతోంది కూడా.
కానీ ఎప్పీ ప్రభుత్వం ఈ మెగా డీఎస్సే ప్రక్రియ మొత్తం నేటి నుంచి కేవలం మూడు నెలలలోనే పూర్తి చేయాలని డెడ్లైన్ విధించింది. కనుక నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. వచ్చే నెల 15 వరకు దరఖాస్తులు స్వీకరించి జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు నిర్వహించబోతోంది.
జూలై నెలాఖరులోగా అర్హత సాధించిన అభ్యర్ధుల జాబితా ప్రకటించి 10-15 రోజులలోగా నియామక పత్రాలు అందించాలని గడువు విధించింది.
ఇంత మెరుపు వేగంతో 16,347 పోస్టులు భర్తీ చేయగలిగితే ఇదీ ఓ సరికొత్త రికార్డే అవుతుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మంచి పేరు కూడా వస్తుంది.