తెలంగాణ ఎంసెట్ ఫలితాలు రేపు (గురువారం) మధ్యాహ్నం 11 గంటలకు విడుదల కాబోతున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నత విద్య్డామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ నవీన్ మిత్తల్ తదితరులు కలిసి రేపు మధ్యాహ్నం సచివాలయంలో విడుదల చేయబోతున్నారు.
మే 12 నుంచి 15 వరకు జరిగిన ఎంసెట్ పరీక్షలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 3,20,384 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో ఇంజనీరింగ్ కోర్సుల కోసం 2,05,031 మంది దరఖాస్తు చేసుకోగా, అగ్రికల్చర్, మెడికల్ తదితర కోర్సుల కోసం 1,14,981 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకొన్నారు.
ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థులు రేపు మధ్యాహ్నం 11 గంటల నుంచి www.emacet.tsche.ac.in వెబ్సైట్లో తమ హాల్ టికెట్ నంబరుతో ఫలితాలను చూసుకోవచ్చు. దాదాపు అన్ని ఆన్లైన్ వార్తాపత్రికలు కూడా తమతమ వెబ్సైట్లలో ఫలితాలను పెడుతున్నాయి.