తెలంగాణ డిగ్రీ కాలేజీలలో ప్రవేశాలకు దోస్త్ ఆహ్వానం

May 12, 2023
img

ఇటీవల ఇంటర్ ఫలితాలు వచ్చినందున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలలో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసస్ (దోస్త్) ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభిస్తోంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్ లింబాద్రి దీనికి సంబందించి నోటిఫికేషన్‌ గురువారం విడుదల చేశారు. దాని ప్రకారం ఈ నెల 16 నుంచి జూన్ 10వ తేదీ వరకు తొలిదశ రిజిస్ట్రేషన్లు, జూన్ 16 నుంచి 26వరకు రెండో దశ, జూలై 1 నుంచి 5వ తేదీ వరకు మూడవ మరియు చివరి దశ రిజిస్ట్రేషన్స్ జరుగుతాయి.


Related Post