తెలంగాణ రాష్ట్రంలో వేసవి ఎండలు, ఉష్ణోగ్రతలు తీవ్రం అవడంతో బుదవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖలో పాఠశాల కార్యదర్శి శ్రీదేవసేన సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతీరోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించి, విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పెట్టిన తర్వాత ఇంటికి పంపించాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. పదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్3 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభమవుతాయి కనుక సాయంత్రం వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వులు తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వర్తిస్తుంది.