టిఎస్పీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ బుదవారం ప్రకటించింది. ఈ ఏడాది జూన్ 5 నుంచి 12వరకు ప్రతీరోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు పరీక్షలు జరుగుతాయి. ఒక్క జనరల్ ఇంగ్లీష్ తప్ప అభ్యర్ధులు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూలలో తాము ఎంచుకొన్న భాషల్లో పరీక్షలు వ్రాయవచ్చు. అభ్యర్ధులు అన్ని పరీక్షలకి విధిగా హాజరుకావలసి ఉంటుంది. ఒక్క పరీక్షకి హాజరుకాకపోయినా అనర్హులవుతారు. గ్రూప్-1లో మొత్తం 503 ఉద్యోగాలకి ప్రిలిమ్స్ వ్రాసినవారిలో ఒక్కో పోస్టుకి 50 మంది చొప్పున ఎంపికచేయగా 25,150 మంది అర్హత సాధించారు. వారిలో ఈ మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించినవారు ఈ ఉద్యోగాలకి ఎంపిక అవుతారు.