తెలంగాణ ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాలు ఈ నెల 23న విడుదల కావలసి ఉండగా అనివార్య కారణాల వలన రేపు అంటే శనివారం విడుదల చేయబోతున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. ఈ ఏడాది మొత్తం 9,07,393 మంది విద్యార్దులు పరీక్షలు వ్రాశారు. ఇంటర్ ఫలితాలను www.results.cgg.gov.in , www.tsbie.cgg.gov.in , www.bie.telangana.gov.in తదితర వెబ్సైట్లలో చూసుకోవచ్చు.
పదో తరగతి ఫలితాలు ఈ నెలాఖరులోగా వెలువడతాయి. కనుక జూలై చివరివారంలో లేదా ఆగస్ట్ మొదటి వారంలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు డీఈవోలను ఆదేశించారు.