యూనివర్సిటీ స్థాపిస్తున్న మోహన్ బాబు

January 13, 2022
img

ప్రముఖ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు త్వరలో తన పేరిట తిరుపతిలో ‘మోహన్ బాబు యూనివర్సిటీ’ స్టాపించబోతున్నట్లు ట్విట్టర్‌లో ప్రకటించారు. కులమత ప్రాంతీయ భేదభావాలు చూపకుండా పిల్లలందరికీ సమానంగా విద్యా అందించాలనే సత్సంకల్పంతో 1993లో మోహన్ బాబు తిరుపతిలో శ్రీ విద్యానికేతన్ ప్రారంభించారు. దానికి మంచి ఆదరణ లభించడంతో ఆ తరువాత వరుసగా విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్, విద్యానికేతన్ జూనియర్, డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ, పీజీ కాలేజిలను ఏర్పాటు చేసి విజయవంతంగా నడిపిస్తున్నారు. గత 30 ఏళ్లుగా తన విద్యాసంస్థలు అందరి అభిమానం, ఆదరణ పొందుతున్నాయని కనుక ఇప్పుడు తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనుకొంటున్నట్లు మోహన్ బాబు ప్రకటించారు.  


Related Post