తెలంగాణ రాష్ట్రంలో ఇకపై ఆరు యూనివర్సిటీలలో ఒకే అకాడమిక్ క్యాలెండర్ అమలుచేయబోతున్నాయి. రాష్ట్రంలోని కాకతీయ, ఉస్మానియా, తెలంగాణ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ యూనివర్సిటీలలో ఇంతవరకు వేర్వేరు సమయాలలో తరగతులు, పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఆ కారణంగా విద్యార్దులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనుక ఇక నుంచి ఆరు యూనివర్సిటీలలో కామన్ అకాడమిక్ క్యాలండర్ ప్రకారం ఒకే సమయంలో తరగతులు, సెమిస్టర్, ఇంటర్నల్, వార్షిక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి చెప్పారు. డిసెంబర్ 16న కామన్ అకాడమిక్ క్యాలండర్ ప్రకటించే అవకాశం ఉందని చెప్పారు.