టిఎస్ ఐసెట్-2021 ఫలితాలువిడుదల

September 23, 2021
img

రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏలో ప్రవేశాలకు సంబందించిన టిఎస్ ఐసెట్-2021 ప్రవేశ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో కామర్స్ అండ్ మేనేజ్మెంట్ విభాగంలోని సెమినార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి టిఎస్ ఐసెట్-2021 ఫలితాలను విడుదల చేశారు. ఐసెట్-2021 ప్రవేశ పరీక్ష ఫలితాలలో 90.09 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు  ఆయన తెలిపారు.

రాష్ట్రంలో నలుగురు విద్యార్థులు మొదటి నాలుగు ర్యాంకులు సాధించగా మరో ఐదుగురు టాప్ ర్యాంక్స్‌ సాధించారు. 5వ ర్యాంకు మాత్రం ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన ఆనంద్ పాల్ సాధించారు. హైదరాబాద్‌కు చెందిన ఆర్.లోకేష్ మొదటి ర్యాంకు, ఆ తరువాత వరుసగా పమిడిసాయి తనూజ (హైదరాబాద్‌), నవీన్ కృష్ణ (మల్కాజిగిరి) రెండు, మూడు ర్యాంకులు సాధించారు. ఆర్‌.నవీన శాంత ( హైదరాబాద్‌), తుమ్మ రాజశేఖర్ (హైదరాబాద్‌) నాల్గవ ర్యాంక్ సాధించారు. ఐసెట్ ఫలితాలకోసం https://icet.tsche.ac.in లో చూడవచ్చు.


Related Post