సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన సాహితీవేత్తలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015 సంవత్సరం నుంచి ఏటా కాళోజీ పురస్కారాన్ని అందజేస్తోంది. 2021 సంవత్సరానికి గాను నల్గొండ జిల్లాకు చెందిన విశ్రాంత లెక్చరర్ పెన్నా శివరామకృష్ణకు ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారం అందజేయబోతోంది. ఆయన ‘అలల పడవ మీద’ , ‘నిశ్శబ్దం నా మాతృక’ వంటి అనేక కవితా సంకలనాలను ప్రచురించారు. ఆయన రచించిన గజల్ ప్రక్రియకు సాహితీవేత్తల ప్రశంసలు అందుకొన్నారు. ఆయన రచించిన ‘దీపఖడ్గం’ సంపుటికి 2010లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి పురస్కారం అందుకోనారు. గురువారం కాళోజీ జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో పెన్నా శివరామకృష్ణకు ఈ పురస్కారం అందజేయనున్నారు. దీంతోపాటు రూ. 1,0,116 నగదు బహుమతి, మెమొంటో ప్రధానం చేస్తారు.