జూలై నుంచి ఇంటర్ తరగతులు షురూ

June 15, 2021
img

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ప్రదమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు రద్దు చేసినందున వారం రోజులలోగా ఫలితాలు ప్రకటించి జూలై నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ తెలిపారు. జూలై 1 నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్, జూలై 15 తరువాత నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. కనుక ప్రైవేట్ కాలేజీలు కూడా ఇంచుమించు ఇవే తేదీలలో తరగతులు ప్రారంభించనున్నాయి. అయితే విద్యాసంవత్సరం ప్రారంభం కాకమునుపే ఫీజులు వసూలు చేస్తే కటిన చర్యలు తీసుకొంటామని ఉమర్ జలీల్ హెచ్చరించారు.  


Related Post