తెలంగాణ ఇంటర్ ద్వితీయ పరీక్షలు రద్దు

June 09, 2021
img

తెలంగాణలో ఇంటర్ ద్వితీయ పరీక్షలు రద్దయ్యాయి. నిన్న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చర్చ జరిగినప్పుడు ఈ అంశంపై కూడా చర్చించారు. ప్రస్తుత పరిస్థితులలో ఇంటర్ పరీక్షలు నిర్వహించడం సరికాదని కనుక పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించారు. పరీక్షలు రద్దు చేసినందున విద్యార్దులకు గ్రేడ్స్, ఫలితాలపై ఇంటర్ బోర్డ్ బుదవారం సాయంత్రం అధికారిక ప్రకటన చేయనుంది. ఇప్పటికే రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్ ప్రధమ సంవత్సరం పరీక్షలు రద్దు చేసి విద్యార్దులను పై తరగతులకు ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇంటర్ ద్వితీయ విద్యార్దులు కూడా పరీక్షలు వ్రాయకుండానే ప్రమోట్ కానున్నారు. 


Related Post