కరీంనగర్లో బుధవారం ఆన్లైన్ వేదికగా జాబ్మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి అధికారి తెలిపారు. దీనిలో పలు ప్రైవేటు కంపెనీలు పాల్గొని ఉద్యోగాలను భర్తీ చేసుకొనున్నాయని కనుక అర్హులైన నిరుద్యోగులు ఈ జాబ్మేళాకు హాజరయ్యి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముందుగా అభ్యర్ధులు తమ పూర్తి వివరాలను www.ncs.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకొని, ఆ తర్వాత onlinejobmelaresume@gmail.com కు తమ రెజ్యూమ్ను పంపించాలని జిల్లా ఉపాధి అధికారి సూచించారు.
అర్హ తలు : పదవ తరగతి ఉత్తీర్ణత, ఇంటర్, డిగ్రీ, డిప్లమా.