తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఎడ్సెట్-2021 నోటిఫికేషన్ శుక్రవారం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బీఈడీ కళాశాలలో ఉన్న సీట్ల భర్తీకై ఎడ్సెట్ ఎంట్రన్స్ పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షలు ఆన్లైన్ ద్వారా నిర్వహించనున్నారు.
అర్హతలు : డిగ్రీ, ఇంజనీరింగ్
ఫీజుల వివరాలు : జనరల్ అభ్యర్థులకు రూ.650, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.450 గా ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ: ఏప్రిల్ 19 నుంచి
దరఖాస్తుల చివరి తేది: జూన్ 16 వరకు
రూ. 250 ఆలస్య రుసుముతో: జూన్ 25 వరకు
రూ.500 ఆలస్య రుసుముతో: జూలై 7 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు.
ఎడ్సెట్ ఎంట్రెన్స్ పరీక్ష ఆగస్ట్ 24,25 తేదీలలో జరుగుతుంది. అన్ని మెథడాలజీకి కలిపి ఓకే ప్రశ్నపత్రం ఉంటుందని ఉన్నత విద్యా మండలి కన్వీనర్ తెలిపారు. సిలబస్, నమూనా ప్రశ్నపత్రాలు అధికార వెబ్ సైట్ లో పొందుపరిచినట్లు కన్వీనర్ తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షకు సంబందించి పూర్తి వివరాలను ఉన్నత విద్యామండలి వెబ్సైట్ https://edcet.tsche.ac.in లో చూడవచ్చు.