తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పీజీఈసెట్ 2021-22 ఎంట్రెన్స్ పరీక్ష షెడ్యూల్ను ప్రకటించింది. వచ్చే విద్యా సంవత్సరానికి ఎంటెక్, ఎం.ఫార్మసీ, ఎం.ఆర్క్ కోర్సుల్లో ఎంట్రెన్స్ పరీక్షలు మార్చి 12వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. పీజీ ఈసెట్ ఎంట్రన్స్ పరీక్ష ఫీజు రూ.1,000, దివ్యాంగులకు రూ.500 ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది.
ముఖ్యమైన తేదీలు: పీజీఈసెట్ దరఖాస్తుల స్వీకరణ: మార్చి 12, 2021 నుంచి.
చివరి తేదీ: జూలై 10, 2021
జూలై 31వరకు రూ.500, ఆగస్టు31వరకు రూ.1,000 లేటు పెనాల్టీతో ఫీజుతో దరఖాస్తులు సమర్పించవచ్చునని ఉన్నతవిద్యా మండలి తెలియజేసింది.
అడ్మిట్ కార్డు రిలీజింగ్ డేట్:17 సెప్టెంబర్
పీజీ ఈసెట్ ఎంట్రెన్స్ పరీక్ష 21 సెప్టెంబర్ నుండి 24 తేదీ వరకు జరగనున్నాయి.