తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ బుధవారం ఐసెట్ 2021-2022 షెడ్యూల్ను విడుదల చేసింది. ఎంబీఏ, ఎంసీఏ ఎంట్రన్స్ కోసం ప్రతి సంవత్సరం నిర్వహించే ఐసెట్ నోటిఫికేషన్ ఏప్రిల్ 3వ తేదీన విడుదల చేయనున్నారు. ఏప్రిల్ ఏడో తేదీ నుంచి ఆన్లైన్లో ఐసెట్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఐసెట్ ఎంట్రెన్స్ పరీక్ష ఫీజు రూ. 650 కాగా దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు పరీక్ష ఫీజు రూ.450గా ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. రాష్ట్రంలోని 14 కేంద్రాలలో ఐసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు.
ముఖ్యమైన తేదీలు:
ఏప్రిల్ 7 : ఆన్లైన్లో ఐసెట్ దరఖాస్తుల స్వీకరణ
జూన్ 15: ఐసెట్ దరఖాస్తులకు చివరి రోజు
ఎల్ఆర్ఎస్నుఈట్ పెనాల్టీ ఫీజు వివరాలు: జూన్ 30 వరకు రూ. 250, జూలై 15వరకు రూ.500, జూలై 30వరకు రూ.1,000 లేట్ పెనాల్టీ ఫీజుతో ఐసెట్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఐసెట్ ఎంట్రెన్స్ పరీక్ష ఆగస్టులో మూడు దశల్లో నిర్వహించనున్నారు.